రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: దానం నాగేందర్
- కాంగ్రెస్, బీజేపీలకు కాలంచెల్లిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- తెలంగాణ ప్రభుత్వ స్కీములను మిగతా రాష్ట్రాల్లో అమలు చేయగలరా అంటూ సవాల్
- ఎన్ని డిక్లరేషన్లు పెట్టినా బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని ధీమా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసని దానం నాగేందర్ చెప్పారు. ముందు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని, వాటిని చక్కదిద్దే మార్గం చూడాలని ప్రతిపక్ష నేతలకు ఎమ్మెల్యే హితవు పలికారు. ఈమేరకు ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పీజేఆర్ నగర్ లో పెద్ద సంఖ్యలో యువత బీఆర్ఎస్ లో చేరారు. దానం నాగేందర్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు.