ఐదేళ్లలోనే వైద్య చికిత్సా ఖర్చు రెట్టింపు
- వేగంగా పెరుగుతున్న చికిత్సల ధరలు
- మెట్రోల్లో అయితే మరీ ఎక్కువ
- ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సమస్యలకు మరింత వ్యయం
2018లో ఇన్ఫెక్షన్ వ్యాధులకు సంబంధించి ఓ క్లెయిమ్ సగటు మొత్తం రూ.24,569గా ఉంటే, అది 2022 నాటికి రూ.64,135కు పెరిగింది. అంటే ఏటా 26 శాతం చొప్పున కాంపౌండెడ్ గా పెరిగినట్టు అర్థం అవుతోంది. మెట్రోల్లో ఈ చార్జీలు ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. ముంబై వంటి పట్టణాల్లో ఇన్ఫెక్షన్ చికిత్సా వ్యయం సగటున రూ.30వేల నుంచి రూ.80వేలకు పెరిగింది.
శ్వాసకోశ వ్యాధుల క్లెయిమ్ రూ.48,452 నుంచి రూ.94,245కు పెరిగింది. అదే ముంబైలో అయితే దీనికి రూ.80వేలు ఛార్జ్ కాస్తా రూ.1.7 లక్షలకు పెరిగిపోయింది. కరోనా మహమ్మారి చికిత్సా వ్యయాలు పెరిగేందుకు దారితీసింది.