రూ. 50 లక్షల విలువైన వజ్రపుటుంగరం చోరీ.. పోలీసుల భయంతో టాయిలెట్ కమోడ్లో పడేసిన యువతి
- హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఘటన
- చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ
- చికిత్స కోసం చేతికున్న ఉంగరం తీసి పక్కన పెట్టిన వైనం
- ఉంగరాన్ని దొంగిలించిన యువతి అరెస్ట్
ఆ తర్వాత విషయం గుర్తొచ్చి హడావుడిగా ఆసుపత్రికి వచ్చారు. అక్కడి సిబ్బందిని అడిగినా ఫలితం లేకపోవడంతో నరేంద్రకుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బందిలో ఒకరైన లాలస అనే యువతిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టిష్యూ పేపర్లో చుట్టిన ఉంగరాన్ని తన పర్సులో ఎవరో పెట్టారని, తాను భయంతో దానిని టాయిలెట్ కమోడ్లో విసిరేశానని తెలిపింది. దీంతో టాయిలెట్ కమోడ్, పైపులైన్లను తొలగించి గాలించగా ఉంగరం దొరికింది. సదరు యువతిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.