KCR: విశాఖ శారదా పీఠాధిపతితో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

  • హైదరాబాద్ విచ్చేసిన స్వరూపానందేంద్ర
  • చందానగర్ వెంకటేశ్వరస్వామి ఆలయ సముదాయానికి వచ్చిన సీఎం కేసీఆర్
  • స్వరూపానందతో మర్యాదపూర్వక సమావేశం
  • సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ 
CM KCR met Swaroopanandendra in Hyderabad

విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో, చందానగర్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో స్వరూపానందేంద్ర సరస్వతిని తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ వెంట శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు. ఈ భేటీలో ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా పాల్గొన్నారు. వీరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉల్లాసంగా కనిపించారు. 

More Telugu News