Ranveer Singh: చెన్నై విజయంపై నటీ నటుల స్పందన

  • జడేజాని రవీంద్ర సింగ్ జడేజాగా అభివర్ణించిన రణవీర్ సింగ్
  • గుజరాత్ జట్టుకూ అభినందనలు
  • తాను మూగబోయానంటూ త్రిష పోస్ట్
  • అభినందనలు చెప్పిన కీర్తి సురేశ్ 
Ranveer Singh to Trisha celebs call Chennai Super Kings GOAT as they win IPL trophy for 5th time

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంపై పలువురు నటీ నటులు తమదైన శైలిలో స్పందించారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తన ట్విట్టర్ పేజీలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. చివరి రెండు బంతులను విజయాస్త్రాలుగా మలిచి, చెన్నై గెలుపును ఖాయం చేసిన రవీంద్ర జడేజాను ప్రత్యేకంగా ‘రవీంద్ర సింగ్ జడేజా’ అంటూ సంబోధించాడు. ఓ మై గాడ్, ఎలాంటి ముగింపు, ఎలాంటి ముగింపు అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశాడు.

అలాగే, గుజరాత్ జట్టునూ రణవీర్ మెచ్చుకున్నాడు. హార్థిక్ పాండ్యా నాయకత్వాన్ని అద్భుతంగా అభివర్ణిస్తూ నూరు మార్కులు వేశాడు. గుజరాత్ అన్ని విధాలుగా పోరాడినా కానీ ఓడిపోయిందని పేర్కొన్నాడు. దక్షిణాది నటి త్రిష కూడా ఇన్ స్టా గ్రామ్ లో స్పందించింది. ‘‘సీఎస్ కే, నేను మూగబోయాను. నిజం నిజం నిజం’’ అని త్రిష పేర్కొంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందిస్తూ.. ‘‘ఎంత గొప్ప ఫైనల్స్. మూడు రోజుల పాటు వేచి చూడతగ్గదే. ఆందోళన, పిచ్చి, ప్రేమ అన్నీ కూడా ఒక్క ఆట కోసమే. అది కూడా ఒక జట్టు, ఒక మనిషి కోసమే’’ అంటూ ధోనీని ప్రస్తావించింది. ‘‘దేవుడా నేను ఈ రోజు చనిపోయాను. అయినా మేము సాధించాం. మేం విజేతలం. జడేజా నీవు రాక్ స్టార్. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని మేము ప్రేమిస్తాం’’ అంటూ వరలక్ష్మీ పోస్ట్ పెట్టారు. 

ఇక కీర్తి సురేశ్ కూడా అభినందనలు చెప్పింది. జడ్డూ తనదైన స్టయిల్ లో మ్యాచ్ ను ముగించాడని పేర్కొంది. అలాగే ఐశ్వర్య రజనీకాంత్, విఘ్నేష్ శివన్, జ్ఞానముత్తు, పలువురు ఇతర సెలబ్రిటీలు కూడా చెన్నై జట్టుకు అభినందనలు చెప్పారు.

More Telugu News