Women: భర్తకు విడాకులు ఇచ్చి మరో మహిళను పెళ్లాడింది!

  • పశ్చిమబెంగాల్ లో మహిళల స్వలింగ వివాహం
  • నిన్న ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్న మహిళలు
  • వీరిలో ఒకరికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వైనం
Same sex marriage in West Bengal

పశ్చిమబెంగాల్ లో ఇద్దరు మహిళలు స్వలింగ వివాహం చేసుకున్నారు. దీని కోసం ఒక మహిళ ఏకంగా తన భర్తకు విడాకులు కూడా ఇచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే మౌసుమి దత్తా, మౌమిత అనే ఇద్దరు మహిళలు కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. మౌసుమి దత్తాకు ఇప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పిల్లలను తన పిల్లలుగా స్వీకరించేందుకు మౌమిత అంగీకరించింది. దీంతో తన భర్తకు మౌసుమి విడాకులు ఇచ్చేసింది. నిన్న ఒక ఆలయంలో మౌమితను పెళ్లి చేసుకుంది. 

ఈ సందర్భంగా మౌమిత మాట్లాడుతూ... ప్రేమ అనేది స్త్రీ, పురుషుల మధ్యే కాకుండా ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషుల మధ్య కూడా చిగురిస్తుందని అన్నారు. మౌసుమిని వివాహం చేసుకోవడం తన కుటుంబానికి ఇష్టం లేదని... అందుకే తన ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టానని తెలిపారు. మౌసుమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని చెప్పారు. మరోవైపు మౌసుమి మాట్లాడుతూ... తన భర్త రోజూ తనను చిత్రహింసలకు గురి చేసేవాడని, అందుకే ఆయన నుంచి విడిపోయానని తెలిపారు. 

More Telugu News