Pawan Kumar: అమరావతి ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ మృతి

Constable who bitten by snake died
షార్ట్స్‌లో చూడండి
అమరావతిలో ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చిన ప్రకాశం జిల్లా దర్శి కానిస్టేబుల్ పవన్ కుమార్ పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. అయితే, పవన్ కుమార్ చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. 

 విధి నిర్వహణ అనంతరం పవన్ కుమార్ తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తుండగా కట్ల పాము కాటు వేసింది. దాంతో పవన్ కుమార్ ఆ పామును పట్టుకుని ఇవతలికి లాగారు. ఆ క్రమంలో పాము చేతిపై కూడా కాటు వేసింది. 

ఇతర కానిస్టేబుళ్లు ఆ పామును చంపివేసి, పవన్ కుమార్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, అతడిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. 

పవన్ కుమార్ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సహచర కానిస్టేబుళ్లలో విషాదం నెలకొంది.
Go Back to Shorts
Pawan Kumar
Constable
Death
Snake Bite
Ananatavaram
R-5 Zone
Amaravati
Police
Andhra Pradesh

More Telugu News