తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బోల్తా పడిన కారు
- 33వ మలుపు వద్ద ఘటన
- అదుపుతప్పి రోడ్డు పక్కకి పడిపోయిన కారు
- ఘటన జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు
- ప్రయాణికులకు స్వల్ప గాయాలు
ఇతర వాహనాల వారు ఈ విషయాన్ని టీటీడీ భద్రతా సిబ్బందికి తెలియజేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కారు నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కారులోని వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.