Chiranjeevi: ఇద్దరు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన మెగాస్టార్!

  • ముగింపు దశలో చిరూ 'భోళా శంకర్'
  •  ఆ తరువాత దర్శకుడిగా తెరపైకి వినాయక్ పేరు 
  • కృష్ణవంశీ కథకి మార్పులు చెప్పిన చిరంజీవి 
  • మెగాస్టార్ తో సినిమాకి ట్రై చేస్తున్న 'బింబిసార' డైరెక్టర్
Chiranjeevi up comong movies

చిరంజీవి నుంచి త్వరలో 'భోళా శంకర్' సినిమా రానుంది. చిరూ సరసన తమన్నా .. ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి ఏయే దర్శకులతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ నేపథ్యంలో తెరపైకి వీవీ వినాయక్ - కృష్ణవంశీ పేర్లు వచ్చాయి. 2019లో అజిత్ హీరోగా చేసిన 'విశ్వాసం' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాను వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు. అయితే క్రితం ఏడాది మలయాళంలో వచ్చిన మమ్ముట్టి మూవీ 'భీష్మ పర్వం' అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా చరణ్ దక్కించుకున్నట్టు సమాచారం. 

ఈ రీమేక్ ను కూడా వినాయక్ అయితే బాగ్ హ్యాండిల్ చేస్తాడని మెగాస్టార్ భావిస్తున్నారట. దాంతో ఈ రెండు రీమేకులలో ముందుగా ఏది సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక గతంలోనే చిరంజీవికి కృష్ణవంశీ 'వందేమాతరం' అనే కథను వినిపించి ఉన్నాడు. అయితే చిరంజీవికి అప్పుడున్న కమిట్మెంట్స్ వలన ఆ కథను చేయడం కుదరలేదు. తాజాగా మరోసారి కథను విన్న చిరంజీవి కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక 'బింబిసార' డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ కూడా చిరంజీవితో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. 

More Telugu News