MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి గిఫ్ట్ ఇస్తారా?

  • ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ × రాజస్థాన్ రాయల్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 రన్స్ చేసిన రాజస్థాన్
  • జోస్ బట్లర్ అర్ధసెంచరీ.. రాణించిన అశ్విన్, హెట్మెయర్, పడిక్కల్
  • చెన్నై కెప్టెన్ గా 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ
CSK players eyes in win for MSD

ఐపీఎల్-16లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 52, దేవదత్ పడిక్కల్ 38, అశ్విన్ 30, హెట్మెయర్ 30 (నాటౌట్) రాణించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఆకాశ్ సింగ్ 2, తుషార్ దేశ్ పాండే 2, రవీంద్ర జడేజా 2, మొయిన్ అలీ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి 200వ మ్యాచ్. దాంతో అందరి దృష్టి ధోనీపైనే ఉంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా తమ సారథికి కానుక ఇవ్వాలని చెన్నై ఆటగాళ్లు భావిస్తున్నారు.

More Telugu News