Chandrababu: మంగళగిరి సీకే కన్వెన్షన్ లో టీడీపీ ఇఫ్తార్ విందు... నమాజ్ చేసిన చంద్రబాబు

  • కొనసాగుతున్న పవిత్ర రంజాన్ మాసం
  • ముస్లింలకు విందు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకత్వం
  • హాజరైన చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు
  • ముస్లింలతో చంద్రబాబు సమావేశం
Chandrababu attends Iftar at CK Convention in Mangalagiri

రంజాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీలోని ముస్లిం నేతలు షరీఫ్, ఫరూఖ్, నాగుల్ మీరా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. 

ఇఫ్తార్ విందు నేపథ్యంలో నిర్వహించిన నమాజ్ లో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలతో సమావేశమైన చంద్రబాబు... గతంలో తమ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. అయితే వైసీపీ వచ్చాక ఆ పథకాలన్నీ రద్దు చేసిందని అన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అండగా నిలుస్తామని, దుల్హన్ తదితర పథకాలను మళ్లీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News