KA Paul: కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Supreme Court set a side KA Paul petition
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. తెలంగాణ నూతన సెక్రటేరియట్ భవనంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. సచివాలయ భవనంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నరబలి అని కేఏ పాల్ తన పిటిషన్ లో ఆరోపించారు. 

 ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాగా, కేఏ పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. అయితే, దేశంలో జరిగే అగ్నిప్రమాద ఘటనలన్నిటినీ సీబీఐతో విచారణ జరిపించమంటారా? అని కేఏ పాల్ పై అసహనం వెలిబుచ్చింది. అగ్నిప్రమాద ఘటనలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
Go Back to Shorts
KA Paul
Supreme Court
Petition
Telangana Secretariat
Fire Accident
Telangana

More Telugu News