కోడికూర కోసం గొడవ.. కొడుకును దారుణంగా హత్య చేసిన తండ్రి
- కర్ణాటకలో తాజాగా వెలుగు చూసిన ఉదంతం
- కొడుకు ఇంటికొచ్చేలోపే కోడి కూర తినేసిన తండ్రి
- తనకు కూర ఎందుకు మిగల్చలేదంటూ తండ్రితో కొడుకు వాగ్వాదం
- క్షణికావేశంలో కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి
ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్ ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివరామన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది.