Pawan Kalyan: మచిలీపట్నం చేరుకున్న పవన్ కల్యాణ్

  • మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ
  • విజయవాడ నుంచి వారాహి వాహనంలో వచ్చిన పవన్
  • సభకు భారీగా తరలివచ్చిన అభిమానులు, జనసైనికులు
  • కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్న పవన్
Pawan Kalyan arrives Machilipatnam

విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంలో జనసేన ఆవిర్భావ సభకు బయల్దేరిన పవన్ కల్యాణ్ మచిలీపట్నం చేరుకున్నారు. భారీ జనసందోహం కారణంగా పవన్ రాక ఆలస్యమైంది. కాగా, జనసేన 10వ ఆవిర్భావ సభ మచిలీపట్నం శివార్లలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ప్రారంభమైంది. మచిలీపట్నం చేరుకున్న పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభ వేదికపైకి అడుగుపెట్టారు. ఈ సభకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. 

మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ కోసం ఏర్పాటు చేసిన వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదిక అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్న 47 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.

More Telugu News