Janasena: జనసేన ఆవిర్భావ సభపై కసరత్తులు... రెండ్రోజుల ముందే పవన్ రాక

Exercises ongoing for Janasena party foundation day meeting
షార్ట్స్‌లో చూడండి
మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో ఈ సభ జరగనుండడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, జనసేన పార్టీ అధినాయకత్వం పార్టీ ఆవిర్భావ సభపై ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. ఈ నెల 8న ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండ్రోజుల ముందే అమరావతికి రానున్నారు. ఈ నెల 12న పవన్ కల్యాణ్ అన్ని నియోజకవర్గాల కాపు నేతలతోనూ, కాపు రిజర్వేషన్ ఉద్యమకారుడు హరిరామజోగయ్యతోనూ భేటీ కానున్నారు. ఆ మరుసటి రోజు మార్చి 13న జనసేన కీలక నేతలతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Janasena
Foundation Day
Pawan Kalyan
Machilipatnam
Andhra Pradesh

More Telugu News