Team India: ఓపెనర్లు రోహిత్, గిల్ మళ్లీ ఫెయిల్.. కష్టాల్లో భారత్

  • 5 పరుగులు చేసిన గిల్, 12 పరుగులకే రోహిత్ ఔట్
  • ఇద్దరినీ పెవిలియన్ చేర్చిన స్పిన్నర్ లైయన్
  • తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా
Rohith sharm and gill flatter again

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత బ్యాటర్ల తడబాటు కొనసాగుతూనే ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌటై జట్టు ఇప్పటికే ఇక్కట్లలో పడింది. బౌలర్ల ప్రతిభతో ఆస్ట్రేలియాను 200ల్లోపే కట్టడి చేయడంతో రెండో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 88 పరుగుల లోటు స్కోరుతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ మళ్లీ నిరాశ పరిచారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే గిల్ (5) నేథన్ లైయన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ (12) సైతం 15వ ఓవర్లో లైయన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో 32 పరుగులకే భారత్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయి డీలా పడింది. ప్రస్తుతం పుజారా, కోహ్లీ క్రీజులో ఉన్నారు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో ఓవర్ నైట్ స్కోరు 156/4తో ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓ దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన కంగారూ జట్టు.. 11 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.

More Telugu News