వరుణ్ తేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఎంతవరకూ వచ్చిందంటే ..!
- 'గాండీవధారి అర్జున'గా వరుణ్ తేజ్
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- యూరప్ లో జరగనున్న షూటింగు
- హీరోయిన్ గా అలరించనున్న సాక్షి వైద్య
- ప్రతినాయకుడిగా కనిపించనున్న వినయ్ రాయ్
ఈ సినిమాకి 'గాండీవధారి అర్జున' అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు యూకేలో జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అనంతరం, అక్కడి షెడ్యూల్ ను పూర్తిచేశారు. అక్కడి లొకేషన్ కి సంబంధించిన ఫొటోలను తాజాగా వదిలారు.
తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. అక్కడి లొకేషన్స్ లో మరికొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి టీమ్ రెడీ అవుతోంది. 'ఏజెంట్' సినిమాలో అఖిల్ తో కలిసి నటించిన 'సాక్షి వైద్య'నే ఈ సినిమాలో హీరోయిన్. ప్రతినాయకుడిగా వినయ్ రాయ్ కనిపించనున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.