Team India: తొలి టీ20లో టీమిండియా లక్ష్యం 177 పరుగులు

  • రాంచీలో తొలి టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసిన కివీస్
  • డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే అర్ధసెంచరీలు
  • 2 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్
New Zealand set 177 runs target to Team India

టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రాంచీలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన భారత్... న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టులో ఓపెనర్లు ఫిన్ అలెన్ 35, డెవాన్ కాన్వే 52 పరుగులు చేశారు. చివర్లో డారిల్ మిచెల్ 30 బంతుల్లోనే 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిచెల్ స్కోరులో 3 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. 

టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అర్షదీప్ సింగ్ 1, కుల్దీప్ యాదవ్ 1, శివమ్ మావి 1 వికెట్ తీశారు. ఉమ్రాన్ మాలిక్ ఒక ఓవర్ విసిరి 16 పరుగులు సమర్పించుకోవడంతో అతడికి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు.

More Telugu News