రెండో వన్డేలో భారత్ కు అదిరే ఆరంభం.. ఐదో బంతికే ఓపెనర్ ను బౌల్డ్ చేసిన షమీ
- తొలి మ్యాచ్ లో ఆడిన జట్లను కొనసాగిస్తున్న భారత్, న్యూజిలాండ్
- తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న రాయ్ పూర్
- ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియం
మరోవైపు భారత్, న్యూజిలాండ్ హైదరాబాద్ లో ఆడిన తుది జట్లనే కొనసాగించాయి. ఒక్క మార్పు కూడా లేకుండా బరిలోకి దిగాయి. తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్ లో అద్భుతంగా పోరాడిన కివీస్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. ఇక, రాయ్ పూర్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది. 60 వేల సీటింగ్ సామర్థ్యంతో కూడిన స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది.