kashmir: కశ్మీర్ లో లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి

  • చనిపోయిన వాళ్లలో ఒక జేసీవో, ఇద్దరు జవాన్లు
  • మృతదేహాలను వెలికి తీసిన అధికారులు
  • మంచు పెళ్లలు విరిగిపడడంతో ప్రమాదం
3 Indian Army personnel die after falling into a deep gorge in Kupwara

జమ్మూ కశ్మీర్ లో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. 

దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

More Telugu News