Varla Ramaiah: ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా? లేక చంపేశారా?: వర్ల రామయ్య

  • గుంటూరులో సభాస్థలిని పోలీసులు ముందుగానే పరిశీలించారన్న వర్ల 
  • పోలీసులు పరిశీలించిన తర్వాత కూడా దుర్ఘటన ఎలా జరిగింది?
  • ముగ్గురిని జగన్, ఆయన పార్టీ నేతలే చంపేశారని ఆరోపణ
Jagan and his party leaders killed those 3 women says Varla Ramaiah

గుంటూరు టీడీపీ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందడం అందరినీ కలచి వేస్తోంది. ఇవి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన హత్యలని వైసీపీ నేతలు అంటుండగా... పోలీసుల వైఫల్యమని టీడీపీ మండిపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... చంద్రన్న కానుక కార్యక్రమాన్ని ఒక ఎన్నారై చేపట్టారని, పోలీసుల అనుమతితోనే కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పారు. పోలీసులు ముందుగానే వచ్చి స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. 

పోలీసులు పరిశీలించిన తర్వాత కూడా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా? లేక చంపేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతుండటాన్ని ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. ఈ పనులను వైసీపీ స్లీపర్ సెల్స్ చేస్తున్నాయని ఆరోపించారు.

More Telugu News