ఎన్నికల్లో పోటీ చేస్తా.. మామయ్య అడుగుజాడల్లో నడుస్తా: నందమూరి తారకరత్న
- ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తారకరత్న ప్రకటన
- నందమూరి కుటుంబ సభ్యులు పదవులను కోరుకోరని వ్యాఖ్య
- ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమన్న తారకరత్న
నందమూరి కుటుంబ సభ్యులు ఎలాంటి పదవులను కోరుకోరని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తారకరత్న అన్నారు. తాము ప్రజల సంక్షేమం కోసం పోరాడుతామని, పోరాడుతూనే ఉంటామని చెప్పారు. తన బాబాయ్ బాలకృష్ణ తనకు ఆదర్శమని చెప్పారు. మామయ్య చంద్రబాబు గొప్ప నాయకుడని, ఆయన నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. మామయ్యకు అండగా ఉంటామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామంలో తన తాత, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని తారకరత్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పైవ్యాఖ్యలు చేశారు.