Jogulamba Gadwal District: గద్వాల నగ్నచిత్రాల కేసు.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న పోలీసులు!

  • ప్రధాన సూత్రధారి మహేశ్వర్‌రెడ్డి ఇప్పటికే అరెస్ట్ 
  • హైదరాబాద్‌లో నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఈ కేసులో పోలీసులు, ఉద్యోగులు ఉన్నారన్న వార్తను ఖండించిన సీఐ
Gadwal Police Arrested Accused in Nude Pictures Case

గద్వాల నగ్న చిత్రాల కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి మహేశ్వర్ రెడ్డి (తిరుమలేశ్) స్నేహితుడు నిఖిల్‌ను నిన్న జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అంతుకుముందే అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరు యువ నాయకులపై విచారణ కొనసాగుతోంది. నగ్న చిత్రాలు బయటకు వెళ్లడంలో వీరిద్దరిలో ఒకరి పాత్ర ఉందని తెలుస్తోంది. 

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నగ్న చిత్రాల రికార్డు వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఉద్యోగులు ఉన్నారంటూ వస్తున్న వార్తలను సీఐ చంద్రశేఖర్ ఖండించారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టబోమని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ నగ్న చిత్రాలను తొలుత ఎవరు? ఎవరికి పంపారు? వాటిని ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చిత్రాలను ఎవరూ షేర్ చేయవద్దని, మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఎస్పీ రతన్ కుమార్ హెచ్చరించారు.

More Telugu News