Odisha: విషాదం: పాటలు పాడుతూ గాయకుడు.. గర్భా నృత్యం చేస్తూ యువకుడి మృతి

  • ఒడిశాలో సంగీత విభావరిలో గాయకుడి మృతి
  • మహారాష్ట్రంలో గర్భానృత్యం చేస్తూ ప్రాణాలొదిలిన యువకుడు
  • కుమారుడి మరణవార్త తెలిసి కన్నుమూసిన తండ్రి
Odia singer Murali Mohapatra collapses and dies while performing on stage

దసరా ఉత్సవాల్లో భాగంగా ఒడిశాలోని జయపురంలోని జగత్ జనని ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదాంతమైంది. ఈ  విభావరిలో మురళీ ప్రసాద్ మహాపాత్రా  (59) అనే గాయకుడు రెండు పాటలు పాడారు. ఆపై విశ్రాంతి తీసుకుంటూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, కళకారులు, శ్రోతలు వెంటనే ఆయనను  ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కోరాపుఠ్ జిల్లాకు చెందిన మురళి ‘ఖోకా భాయ్’గా అందరికీ సుపరిచితం. మురళీ ప్రసాద్ గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతోపాటు మధుమేహంతో బాధపడుతున్నట్టు ఆయన సోదరుడు బిభూతి ప్రసాద్ మహాపాత్రా తెలిపారు.  

కాగా, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ పట్టణంలో జరిగిన మరో ఘటనలో మనీశ్ నర్జాపీ (35) గర్భా నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు.  కుమారుడి మరణవార్త విన్న మనీశ్ తండ్రి సోనిగ్రా ఆసుపత్రిలో కుప్పకూలి మరణించారు. అయితే, వీరి మరణానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం వారి మృతికి కారణం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News