టాటా బ్రాండ్ పై త్వరలో చౌక ఎలక్ట్రిక్ కారు
- తక్కువ ధరకే తీసుకొస్తామని ప్రకటించిన టాటా మోటార్స్
- ప్రస్తుతం టాటా ఈవీల ధర రూ.12.50 లక్షల నుంచి ఆరంభం
- 50వేల ఈవీల విక్రయ లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు వెల్లడి
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూకుడుగా వెళుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో అమ్ముడుపోతున్న ప్రతి మూడు ఎలక్ట్రిక్ కార్లలో రెండు టాటా మోటార్స్ సంస్థవే కావడం విశేషం. నెక్సాన్, టిగోర్ వెర్షనకు వాడిన జిప్ట్రాన్ టెక్నాలజీనే చౌక వెర్షన్ కారుకు సైతం వినియోగించినట్టు తెలుస్తోంది. దీని ధర రూ.12.50 లక్షల్లోపే ఉంటుందని, పోటీనిచ్చే విధంగా ధరను నిర్ణయిస్తామని శైలేష్ చంద్ర ప్రకటించారు. 2022-23లో 50వేల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. గత వేసవిలో ముంబైలో టాటా నెక్సాన్ ఈవీలో మంటలు తలెత్తడం అరుదైన ఘటనగా చంద్ర పేర్కొన్నారు. తాము ఇప్పటికి 40వేల ఈవీలు విక్రయించగా, అన్నీ భద్రంగా ఉన్నట్టు చెప్పారు.