TDP: ఈ నెల 24 నుంచి కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

  • 3 రోజుల పాటు కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్న చంద్ర‌బాబు
  • రోజుకో మండ‌లం చొప్పున 3 మండ‌లాల్లో ప‌ర్య‌ట‌న‌
  • పార్టీ బ‌లోపేతంపై పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్న టీడీపీ చీఫ్‌
chandrababu tour in kuppam starts from 24th of this month

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఈ నెల 24 నుంచి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 24న కుప్పం చేరుకోనున్న చంద్ర‌బాబు.. వ‌రుస‌గా 3 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టించ‌నున్నారు. 24న నియోజ‌కవ‌ర్గంలోని రామ‌కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టించ‌నున్న చంద్ర‌బాబు... 25న కుప్పం మండ‌లంలో ప‌ర్య‌టిస్తారు. 

ఆ త‌ర్వాత ఈ నెల 26న నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని గుడిప‌ల్లె మండ‌లంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని పలువురు నేత‌ల‌తో ఆయన స‌మావేశం కానున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న ప‌లు కీల‌క సూచ‌న‌లు చేయ‌నున్నారు.

More Telugu News