భారత్ తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నాం.. చర్చలే మార్గం: పాకిస్థాన్ ప్రధాని
- యుద్ధం ఏ దేశానికి ఆప్షన్ కాదన్న పాక్ ప్రధాని
- సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని వెల్లడి
- అణ్వాయుధాలు, సైన్యం తమ రక్షణ కోసమేనని స్పష్టీకరణ
‘‘మేము భారత్ తో శాశ్వత శాంతి స్థాపన కోరుకుంటున్నాం. అది కూడా చర్చల ద్వారానే. యుద్ధం ఏ దేశానికి ఆప్షన్ కాదు’’ అని షరీఫ్ పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థికం, ప్రజల స్థితిగతులను మెరుగుపరచడంలో రెండు దేశాల మధ్య పోటీ ఉండాలని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ దురాక్రమణదారు కాదంటూ, తమ అణ్వాయుధాలు, సైన్యం అన్నవి కేవలం తమను రక్షించుకోవడానికేనన్నారు.