పారిస్ ఒలింపిక్స్ లో కూడా ఈ జైత్రయాత్ర కొనసాగాలి: పవన్ కల్యాణ్
- కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పవన్ శుభాకాంక్షలు
- పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలవడం గొప్పగా అనిపించిందని వ్యాఖ్య
- మన తెలుగు బిడ్డలు పతకాల పంట పండించడం అందరికీ గర్వకారణమన్న జనసేనాని
"ఈ పోటీలలో మన తెలుగు బిడ్డలు పతకాల పంట పండించడం మనందరికీ గర్వకారణం. విజేతలైన తెలుగు బిడ్డలు పీవీ సింధు, ఆచంట శరత్ కమల్, సాత్విక్ సాయిరాజ్, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మేఘన, రజని, హుస్సాబుద్దీన్, కిదాంబి శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్ తో పాటు ఈ పోటీలలో పాల్గొన్న సుమిత్ రెడ్డి, జ్యోతిలకు తెలుగు ప్రభుత్వాలు ఉదారంగా నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ పోటీలలో మన క్రీడాకారులు విజయం సాధించడానికి వెన్నంటి ప్రోత్సహించిన కోచ్ లు, అధికారులకు అభినందనలు తెలుపుతున్నాను. 2024 లో పారిస్ లో జరగనున్న ఒలింపిక్స్ పోటీలలో ఈ జైత్రయాత్ర కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అని అన్నారు.