Mahesh Babu: మహేశ్ బాబు ద్విపాత్రాభినయమే హాట్ టాపిక్!

  • మహేశ్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు త్రివిక్రమ్ తో
  • కథానాయికలుగా పూజ హెగ్డే - ప్రియాంక అరుళ్ మోహన్
  • వచ్చేనెల 2వ వారం నుంచి  రెగ్యులర్ షూటింగ్ 
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన
Trivikram and Mahesh Babu movie update

మహేశ్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి. వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడనే వార్త షికారు చేసింది. అది నిజమేననే టాక్ ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. ఈ రెండు పాత్రలను త్రివిక్రమ్ డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ తో ఫస్టు షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. 

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 3వ సినిమా కావడంతో అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు. ఈ  సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. రెండవ కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో  ఉన్నారు.

More Telugu News