Talasani: లండన్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన తెలంగాణ మంత్రి తలసాని

  • సికింద్రాబాద్ లో హింసాత్మక ఘటనలు
  • అగ్గిరాజేసిన అగ్నిపథ్
  • రాకేశ్ అనే యువకుడు పోలీసు కాల్పుల్లో మృతి
  • స్పందించిన మంత్రి తలసాని
Telangana minister Talasani Srinivas Yadav staged protest at Ganhi statue in London

కేంద్రం ప్రతిపాదిస్తున్న సైనిక నియామకాల నూతన విధానం అగ్నిపథ్ నేపథ్యంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విధ్వంసం, హింస చోటుచేసుకున్నాయి. పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు కూడా మృతి చెందాడు. దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు. 

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన రాకేశ్ కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం హింసావాదాన్ని ప్రోత్సహిస్తోందని తలసాని విమర్శించారు. ఈ సందర్భంగా లండన్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపినట్టు వెల్లడించారు. మోదీకి మంచి బుద్ధి కలగాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వేడుకున్నానని తెలిపారు.
.

More Telugu News