Kishan Reddy: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల బీజేపీ ఇంఛార్జిగా కిషన్ రెడ్డి నియామకం

  • ఈ నెల 10న పలు రాష్ట్రాలకు రాజ్యసభ ఎన్నికలు
  • మహారాష్ట్ర ఇన్ఛార్జీగా అశ్విని వైష్ణవ్
  • రాజస్థాన్ ఇన్ఛార్జీగా గజేంద్ర సింగ్ షెకావత్
Kishan Reddy appointed as BJP incharge for Karnataka Rajya Sabha elections

ఈ నెల 10వ తేదీన వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించింది. ఈ క్రమంలో కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఇన్ఛార్జీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్, హర్యాణాకు గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్ కు నరేంద్ర సింగ్ తోమర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రకటనను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీరిని నియమించినట్టు ప్రకటనలో తెలిపింది. 

More Telugu News