దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

Corona cases slightly increased in India
  • గత 24 గంటల్లో 2,745 కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా ఆరుగురి మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,386
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. అంతకు ముందు రోజు 2,338 కరోనా కేసులు నమోదు కాగా... గత 24 గంటల్లో 2,745 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 2,236 మంది కరోనా నుంచి కోలుకోగా... ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 18,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,60,832కి పెరిగింది. కరోనా నుంచి 4,26,17,810 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,636 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 1,93,57,20,807 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 10,91,110 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News