UPSC: పేదరికం లేని సమసమాజ నిర్మాణానికి కృషి చేయండి.. సివిల్స్ విజేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు

  • సోమ‌వారం విడుద‌లైన సివిల్స్-2021 ఫ‌లితాలు
  • స‌త్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు
  • వారిని అభినందిస్తూ చంద్ర‌బాబు ట్వీట్
chandrababu greetings to civil servises winners

యూపీఎస్సీ నిర్వ‌హించిన సివిల్స్‌-2021 ఫ‌లితాలు సోమ‌వారం వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు స‌త్తా చాటారు. మంచి ర్యాంకులూ సాధించారు. వీరికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం ఓ ట్వీట్ చేశారు.

అఖిల భార‌త స‌ర్వీసు నియామ‌కాల కోసం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2021లో ఉభ‌య రాష్ట్రాల‌కు చెందిన యువ‌తీ యువ‌కులు స‌త్తా చాటార‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. పేద‌రికం లేని స‌మాజ నిర్మాణానికి మీరంతా కృషి చేయాల‌ని... తద్వారా తెలుగు వారికి, త‌ల్లిదండ్రుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని ఆయ‌న కోరారు.

More Telugu News