Telangana: తెలంగాణ‌లో రూ.1,400 కోట్ల పెట్టుబ‌డిని ప్ర‌క‌టించిన హ్యుందాయ్‌

  • తెలంగాణ‌లో ఏర్పాటు కానున్న మొబిలిటీ క్ల‌స్ట‌ర్‌
  • క్ల‌స్ట‌ర్‌లో పెట్టుబ‌డి పెట్ట‌నున్న హ్యుందాయ్‌
  • దావోస్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం
Hyundai Motor Company will invest 1400 crores in telangana

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి రానుంది. తెలంగాణ‌లో రూ.1,400 కోట్ల పెట్టుబ‌డిని పెట్ట‌నున్న‌ట్లు ద‌క్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుందాయ్ ప్ర‌కటించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నూత‌నంగా ఏర్పాటు చేయ‌నున్న మొబిలిటీ క్ల‌స్ట‌ర్‌లో ఈ పెట్టుబ‌డుల‌ను పెట్ట‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎకన‌మిక్ ఫోరం స‌ద‌స్సులో భాగంగా తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో హ్యుందాయ్ రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందంపై సంత‌కాలు చేసింది.

More Telugu News