Gorantla Butchaiah Chowdary: అమెరికాలో ఎన్టీఆర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ నుంచి పూలవ‌ర్షం.. వీడియో ఇదిగో

  • అమెరికాలోని బోస్టన్ లో టీడీపీ మ‌హానాడు
  • పాల్గొన్న‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, త‌దిత‌రులు
  • వీడియో పోస్ట్ చేసిన బుచ్చ‌య్య చౌద‌రి
gorantla shares a video

అమెరికాలోని బోస్టన్ లో టీడీపీ మ‌హానాడు నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ నుంచి అక్క‌డి టీడీపీ అభిమానులు పూలవ‌ర్షం కురిపించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వీడియో పోస్ట్ చేశారు. ఈ మ‌హానాడులో ఆయ‌న కూడా పాల్గొన్నారు. 

'అమెరికాలోని బోస్టన్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు సంబరాల్లో, హెలికాప్టర్లో అన్న గారి విగ్రహం మీద పూలు చల్లుతూ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది' అని గోరంట్ల చెప్పారు. 

ఈ సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనమండలి సభ్యుడు మంతెన సత్యనారాయణ రాజు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి, గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

More Telugu News