KA Paul: న‌న్ను కొట్టింది కేటీఆర్ మ‌నిషే: కేఏ పాల్ ప్ర‌క‌ట‌న‌

  • నిన్న 20 మంది పోలీసులు వ‌చ్చి తనను ఆపారన్న పాల్ 
  • ఆ త‌ర్వాత వెంట‌నే డీఎస్పీ,  సీఐ వ‌చ్చారని వెల్లడి 
  • తనను కొట్టిన వ్య‌క్తితో పోలీసులు బ్లూ టూత్‌లో మాట్లాడారని చెప్పిన పాల్ 
  • తాను  రైతుల‌ను దూషించ‌లేదన్న కేఏ పాల్‌
ka pal comments on attach on him

తెలంగాణ‌లో సోమవారం నాడు త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించి ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను కొట్టిన వ్య‌క్తి మంత్రి కేటీఆర్ మ‌నిషేన‌‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. పోలీసులు అధికార పార్టీ కోసం ప‌నిచేస్తున్నార‌ని కూడా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నిన్న త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించి నేడు డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు బ‌య‌లుదేరిన త‌న‌ను పోలీసులు అడ్డుకున్న తీరుపై పాల్ ఆగ్రహం వ్యక్తం చెశాయు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ సంద‌ర్భంగా త‌న‌పై జ‌రిగిన దాడిని వివ‌రించిన కేఏ పాల్‌... ఉన్న‌ట్టుండి 20 మంది పోలీసులు వ‌చ్చి త‌న‌ను ఆపార‌ని చెప్పారు. ఆ త‌ర్వాత వెంట‌నే డీఎస్పీ, సీఐ అక్క‌డికి వ‌చ్చార‌న్నారు. త‌న‌ను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూ టూత్‌లో మాట్లాడా‌ర‌ని ఆరోపించారు. తనను కొట్టింది మంత్రి కేటీఆర్ మ‌నిషేన‌ని చెప్పిన పాల్‌... తాను రైతుల‌ను దూషించ‌లేద‌ని తెలిపారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ కోసం ప‌నిచేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

More Telugu News