Janasena: పోలీస్ వ్య‌వ‌స్థ‌ను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోంది: నాగ‌బాబు విమ‌ర్శ‌లు

  • జీత‌భ‌త్యాల‌పై ఆధార‌ప‌డ్డ ఉద్యోగుల‌ను వేధిస్తున్నారన్న నాగబాబు  
  • రైతుల బాధ‌లు తీర్చ‌లేకే వైసీపీ ర‌గ‌డ సృష్టిస్తోందని విమర్శ 
  • వైఫ‌ల్యాలు క‌ప్పిపుచ్చుకునేందుకే ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్న నాగబాబు 
nagababu allegations on ysrcp

ప్ర‌ముఖ సినీ న‌టుడు, జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) స‌భ్యుడు కొణిదెల నాగ‌బాబు ఏపీ ప్రభుత్వంపైనా, అధికార పార్టీ వైసీపీపైనా నేడు విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. 

ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు మాట్లాడుతూ.. "పోలీస్ వ్య‌వ‌స్థ‌ను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోంది. జీత‌భ‌త్యాల‌పై ఆధార‌ప‌డ్డ ఉద్యోగుల‌ను వేధిస్తున్నారు. రైతుల బాధ‌లు తీర్చ‌లేకే వైసీపీ ర‌గ‌డ సృష్టిస్తోంది. వైసీపీ వైఫ‌ల్యాలు క‌ప్పిపుచ్చుకునేందుకే ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తున్నారు" అంటూ నాగ‌బాబు వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

More Telugu News