Crime News: యువ‌తి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకున్న యువ‌కుడు.. మృతి

  • ప్రేమ విఫ‌ల‌మైందని మ‌న‌స్తాపం
  • పెద్ద‌ప‌ల్లి జిల్లా గుంజ‌ప‌డుగులో ఘ‌ట‌న‌
  • మృతుడి స్వ‌స్థ‌లం వ‌రంగ‌ల్ జిల్లా పాప‌య్య‌పేట
youngster dies

ప్రేమ విఫ‌ల‌మైంద‌న్న కార‌ణంతో యువ‌తి ఇంటిముందు ఓ యువ‌కుడు శ‌ర‌రీంపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండ‌లం గుంజ‌ప‌డుగులో చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని త‌న ప్రేయ‌సి ఇంటిముందుకు పెట్రోలుతో వెళ్లిన యువ‌కుడు నిప్పు అంటించుకోవ‌డం చూసిన స్థానికులు మంట‌లు ఆర్పి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 

ఆ యువ‌కుడిని చికిత్స కోసం క‌రీంన‌గ‌ర్  ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి స్వ‌స్థ‌లం వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం పాప‌య్య‌పేట అని పోలీసులు గుర్తించారు.

More Telugu News