Sharad Pawar: హింస జ‌రుగుతున్నా అమిత్‌షా ఆప‌లేక‌పోయారు: శ‌ర‌ద్ ప‌వార్

sharad pawar slams shah
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలోని జహంగీర్ పూర్ లో హ‌నుమాన్ జ‌యంతి వేళ చోటు చేసుకున్న మ‌త‌ప‌ర‌మైన‌ అల్ల‌ర్లపై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ మండిప‌డ్డారు. తాజాగా ఆయ‌న ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడుతూ... ఆ అల్ల‌ర్ల‌ను ఆప‌డంలో అమిత్‌షా విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. సీఎం కేజ్రీవాల్ ఆ అల్ల‌ర్ల‌ను  నియంత్రించేవార‌ని, కానీ అక్క‌డి పోలీసులు కేంద్ర హోంశాఖ ప‌రిధిలో ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. ఆ శాఖ‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చూస్తున్నార‌ని తెలిపారు. 

ఆ ఘ‌ర్ష‌ణ‌ల‌ను అమిత్ షా ఆప‌లేక‌పోయార‌ని, ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పారు. ఢిల్లీలో ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా, ఆ విష‌యం ప్ర‌పంచ‌మంతా తెలిసిపోతుంద‌ని ఆయ‌న అన్నారు. ఢిల్లీలో అశాంతి నెల‌కొంద‌ని త‌ప్పుడు సంకేతాలు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్ర‌భుత్వం ఢిల్లీలోని ప‌రిస్థితుల‌ను నియంత్రించలేక‌పోతోంద‌ని విమ‌ర్శించారు.
Go Back to Shorts
Sharad Pawar
Amit Shah
BJP
ncp

More Telugu News