తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై రేపు బీజేపీ నిరసన
- పెట్రో ధరల పెంపుపై గురువారం టీఆర్ఎస్ నిరసనలు
- విద్యుత్ ఛార్జీల పెంపుపై శుక్రవారం బీజేపీ ఆందోళనలు
- బీజేపీ రాష్ట్ర శాఖ నుంచి ప్రకటన విడుదల
ఈ ప్రకటన ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్టు బీజేపీ తెలిపింది. విద్యుత్ ఛార్జీలను తగ్గించేదాకా బీజేపీ పోరు ఆగదని సదరు ప్రకటనలో ఆ పార్టీ స్పష్టం చేసింది.