Medaram Carnival: ముగింపు ఘట్టానికి చేరిన మేడారం జాతర
ఈ నెల 16 నుంచి అత్యంత వేడుకగా జరుగుతున్న మేడారం జాతర ముగింపు దశకు చేరుకుంది. గత నాలుగురోజులుగా మేడారం జనసంద్రాన్ని తలపించింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. ఈ సాయంత్రం మేడారంలో గద్దెల వద్ద గిరిజన పూజారులు సంప్రదాయ పూజలు చేపట్టారు. దాంతో గద్దెల వద్ద భక్తుల దర్శనాలు నిలిపివేశారు.
మేడారం జాతర ముగియనుండడంతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. మేడారం జాతరకు ఈ నాలుగు రోజుల్లో 1.3 కోట్ల మంది వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు.
మేడారం జాతర ముగియనుండడంతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. మేడారం జాతరకు ఈ నాలుగు రోజుల్లో 1.3 కోట్ల మంది వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు.