తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టును ఆశ్రయిస్తా: నట్టి కుమార్
- తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు
- చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందన్న నట్టి కుమార్
- ప్రభుత్వం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి
- కేసీఆర్, తలసాని లాజిక్ మిస్ అయ్యారని వెల్లడి
తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు చేతుల్లో ఉన్నాయని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాళ్లిద్దరికే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల వల్ల మల్టీప్లెక్స్ లో సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ పేదల పక్షపాతిగా గుర్తింపు పొందినవారేనని, అయితే సినిమా టికెట్ల అంశంలో వారు లాజిక్ మిస్ అయ్యుంటారని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే చిన్న సినిమాలకు అన్యాయం జరిగే నిర్ణయం వచ్చిందని భావిస్తున్నానని తెలిపారు.