Manasa Namaha: 'మనసా నమః'... ఆస్కార్ బరిలో తెలుగు షార్ట్ ఫిలిం

  • దీపక్ దర్శకత్వంలో 'మనసా నమః' లఘుచిత్రం 
  • ప్రధాన పాత్రల్లో విరాజ్ అశ్విన్, దృశిక 
  • ఇప్పటివరకు 900 అవార్డులు
  • ఈ నెల 10 నుంచి ఆస్కార్ సభ్యులకు ప్రదర్శన  
Telugu Short Film Manasa Namaha goes to Oscars

తెలుగు షార్ట్ ఫిలిం 'మనసా నమః' తాజాగా ఆస్కార్ రేసులో నిలిచింది. ఆస్కార్-2022 స్క్రీనింగ్ కు ఈ చిత్రం అర్హత సాధించింది. దీపక్ దర్శకత్వం వహించిన ఈ లఘుచిత్రంలో విరాజ్ అశ్విన్, దృశిక ప్రధాన పాత్రలు పోషించారు. 'మనసా నమః'... ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు వేదికలపై పురస్కారాలు సొంతం చేసుకుంది. అలా ఇప్పటివరకు 900 వరకు అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం.

డిసెంబరు 10 నుంచి ఈ లఘు చిత్రాన్ని ఆస్కార్ సభ్యులకు ప్రదర్శించనున్నారు. ఆస్కార్ సభ్యుల నుంచి గణనీయమైన స్థాయిలో ఓట్లు పొందగలిగితే ఈ షార్ట్ ఫిలింకు విశిష్ట పురస్కారం ఖాయమైనట్టే! హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'మనసా నమః' యూనిట్ ఈ సంగతులు వెల్లడించింది.

More Telugu News