Vaishnav Tej: దూసుకుపోతున్న 'కొండ పొలం' ట్రైలర్!

  • క్రిష్ నుంచి వస్తున్న 'కొండ పొలం'
  • అడవి నేపథ్యంలో జరిగే కథ
  • నిన్న విడుదలైన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల
Kondapolam movie update

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ 'కొండ పొలం' సినిమాను రూపొందించాడు. సాయిబాబు - రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ సమయంలో క్రిష్ ఈ సినిమా చేయడం గురించి విశేషంగా చెప్పుకున్నారు. అలాంటి ఈ సినిమాకి కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

నిన్న మధ్యాహ్నం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది అడవి నేపథ్యంలో సాగే కథ. నల్లమల అడవిని నమ్ముకున్న కొంతమంది గిరిజనుల కథ. అడవిలో కూడా గొర్రెలు మేపుకోవడానికి అవకాశం లేని మనుషుల కథ. ఈ సినిమా కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని క్రిష్ ఈ ట్రైలర్ తోనే చెప్పేశాడు.

ట్రైలర్ ను యూ ట్యూబ్ లో వదలగానే ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా వేగంగా 3 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసేసింది. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కోట శ్రీనివాసరావు .. సాయిచంద్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

More Telugu News