Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్తగా 27,254 క‌రోనా కేసులు
  • కేసుల సంఖ్య మొత్తం 3,32,64,175
  • మ‌రో 219 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,42,874
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్తగా 27,254 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,32,64,175కి చేరింది. అలాగే, నిన్న 37,687 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 219 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,42,874కి పెరిగింది.  

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,24,47,032 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,74,269 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 53,38,945 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు.  దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 74,38,37,643 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

More Telugu News