Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • నిన్న కొత్తగా 34,973 క‌రోనా కేసులు
  • కేసుల సంఖ్య మొత్తం 3,31,74,954
  • నిన్న‌ 260 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,42,009
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్తగా 34,973 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,31,74,954కి చేరింది. అలాగే, నిన్న 37,681 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 260 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,42,009కి పెరిగింది.  

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,23,42,299 మంది కోలుకున్నారు. 3,90,646 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 72,37,84,586 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 26,200 కొత్త కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 114 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News