Sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన మార్కెట్లు
  • 29 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 8 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఆద్యంతం మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ సూచీలు ఈరోజు ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 58,250కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 17,353 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.51%), ఎన్టీపీసీ (1.15%), టైటాన్ కంపెనీ (1.13%), సన్ ఫార్మా (1.05%), యాక్సిస్ బ్యాంక్ (0.99%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-2.27%), మారుతి సుజుకి (-1.40%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.23%), బజాజ్ ఆటో (-1.22%), టీసీఎస్ (-0.96%).

More Telugu News