అమెరికాలో ఇడా తుపాను బీభత్సం.. ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయ అమెరికన్ల మృతి
- ఇడా తుపాను కారణంగా ఇప్పటి వరకు 65 మంది బలి
- కారులో వెళ్తుండగా వరదలో చిక్కుకుపోయిన మాలతి
- మురుగు కాల్వ పైపులోకి జారిపోయిన ధనుష్రెడ్డి
- మరో ఘటనలో భర్త కళ్లముందే కొట్టుకుపోయిన భార్య, కుమారుడు
మరో ఘటనలో మురుగు పైపులోకి జారిపోవడం ద్వారా ధనుష్రెడ్డి మరణించారు. 8 కిలోమీటర్ల దూరంలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఇంకో ఘటనలో న్యూయార్క్లో దామేశ్వర్ రామ్స్ క్రీట్స్ భార్య తారా రామ్స్క్రీట్స్, ఆయన 22 ఏళ్ల కుమారుడు నిక్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. భార్యను రక్షించేందుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, తన కళ్లముందే వారిద్దరూ కొట్టుకుపోయారని దామేశ్వర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఇడా తుపానులో ఇప్పటి వరకు 65 మంది ప్రాణాలు కోల్పోయారు.