Taliban: అమెరికా డ్రోన్ దాడుల్లో సాధారణ పౌరులు కూడా చనిపోయారు: తాలిబన్ల ఆగ్రహం

  • అమెరికా దాడిలో ఏడుగురి మృతి
  • తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపణ
  • ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్యలు 
  • చైనా మీడియాతో జబీహుల్లా ముజాహిద్
Taliban furious after US drone attack in Kabul

కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడికి యత్నించిన ఆత్మాహుతి దళ సభ్యుడిని అమెరికా బలగాలు నిన్న డ్రోన్ దాడిలో తుదముట్టించాయి. అయితే ఈ దాడిలో సాధారణ పౌరులు కూడా మరణించారని తాలిబన్లు మండిపడుతున్నారు. అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, దాడిపై తమకు ముందస్తు సమాచారం అందించలేదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రస్థాయిలో స్పందించారు. పరాయిగడ్డపై అమెరికా బలగాలు ఈ విధమైన దాడులకు పాల్పడడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

"ఆఫ్ఘనిస్థాన్ లో ఏదైనా తీవ్ర ముప్పు ఉంటే మాకు తెలియజేయాలి. అంతేతప్ప ఏకపక్షంగా దాడులు చేయడం తగదు. ఈ ఘటనలో సామాన్య పౌరులు కూడా చనిపోయారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అధికారిక మీడియా సంస్థ సీజీటీఎన్ కు పంపిన లిఖితపూర్వక స్పందనలో జబీహుల్లా ముజాహిద్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడిలో ఏడుగురు చనిపోయినట్టు వెల్లడించారు.

More Telugu News