పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేతకు ఏపీ సీఎం జగన్ అభినందనలు
- టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం
- షూటింగ్ లో పసిడి నెగ్గిన అవని లేఖర
- చరిత్ర సృష్టించిందన్న సీఎం జగన్
- మరెన్నో పతకాలు గెలవాలని ఆకాంక్ష
ఈ సందర్భంగా భారత పారాలింపిక్ బృందం మొత్తాన్ని అభినందిస్తున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు. టోక్యో పారాలింపిక్స్ లో అమోఘమైన రీతిలో ఫలితాలు సాధిస్తున్నారని, దాని ఫలితమే భారత్ కు ఇప్పటివరకు 7 పతకాలు వచ్చాయని వివరించారు. అంతేకాదు, మనవాళ్లు మరిన్ని పతకాలను గెలుస్తారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.